
హర్యానాలో పోలింగ్ తేదీని సవరించింది ఎన్నికల సంఘం. హర్యానలో అక్టోబర్ 1 కి బదులుగా అక్టోబర్ 5, 2024న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. దీంతో పాటు హర్యానా ఎన్నికల కౌంటింగ్ తేదీని అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 8కి మార్చింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కౌంటింగ్ తేదీని కూడా అక్టోబర్ 8కి సవరించింది కేంద్ర ఎన్నికల సంఘం.
The Commission had received representation from National President, All India Bishnoi Mahasabha, Bikaner (Rajasthan) for rescheduling the date of polling i.e. 01.10.2024 for Haryana Assembly Election as for generations numerous families of Punjab, Rajasthan and Haryana have…
— ANI (@ANI) August 31, 2024
ఆల్ ఇండియా బిష్ణోయ్ మహాసభ జాతీయ అధ్యక్షుడి అభ్యర్థన మేరకు ఎన్నికల తేదీలో మార్పులు చేసిన ఎన్నికల సంఘం.. అక్టోబర్ 2న రాజస్థాన్ లోని ముకం గ్రామంలో జరిగే బిష్ణోయ్ ల గురువు జంభేశ్వర్ అతిపెద్ద పండగ జరుగుతుంది. పంజాబ్ , రాజస్థాన్, హర్యాలోని వేలాది బిష్ణోయ్ కుటుంబాలు సంప్రదాయబద్దంగా జంభేశ్వర్ ఉత్సవాలు జరుపుకుంటారు. వారికి ఇది అతిపెద్ద పండగ కావడంతో ఎన్నికలను వాయిదా వేయాలని ఆల్ ఇండియా బిష్ణోయ్ మహాసభ అధ్యక్షుడు ఎన్నికల సంఘాన్ని కోరడంతో హర్యానా అసెంబ్లీ ఎన్నికలను అక్టోబర్ 1 కి బదులుగా అక్టోబర్ 5న జరపనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఫలితాలు అక్టోబర్ 8న ప్రకటించనున్నారు.