- ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి కుమ్మరి వెంకటేశ్ ప్రకటన
- కాంగ్రెస్, బీఆర్ఎస్ సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యం కాదని వ్యాఖ్య
- సనత్ నగర్ నియోజకవర్గంలో చర్చనీయాంశం
హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్లు రూ.400, రూ.500 లకే గ్యాస్ సిలిండర్లు ఇస్తే.. తాను ఒక్క రూపాయికే ఏడాదికి నాలుగు సిలిండర్లు ఇస్తానని సనత్ నగర్ ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి కుమ్మరి వెంకటేశ్ ప్రకటించారు. వాళ్లకు సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వెంకటేశ్ ప్రకటన నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. అదొక్కటే కాదు.. రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం, రూపాయికే న్యాయ సలహాలు ఇస్తామని చెబుతున్నాడు. ప్రతీ వంద కుటుంబాలకు ఒక వాలంటర్ను నియమించి.. 70 ఏండ్లు దాటిన వారు ఎమర్జెన్సీ పానిక్ బటన్ నొక్కగానే వాలంటీర్లు వచ్చి సాయం అందిస్తారని తెలిపారు.