తమిళనాడులో రెండు కోట్ల రూపాయలు సీజ్

తమిళనాడులో రెండు కోట్ల రూపాయలు సీజ్

ఎలక్షన్లు దగ్గరపడటంతో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. తమిళనాడులో ఇవాళ రెండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు. పెరంబదూర్ జిల్లాలోని మరువతూర్ దగ్గర.. డీఎంకే నేతలు ప్రయాణిస్తున్న వాహనంలో 2కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుని.. వెహికిల్ సీజ్ చేశారు. PCK పార్టీ మాజీ కార్యదర్శి తంగదురై, డీఎంకే డిప్యూటీ కార్యదర్శి ప్రభాకర్ లు కారులో ప్రయాణిస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకే డబ్బు తీసుకువెళుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.