
పద్మారావునగర్, వెలుగు: టెంట్తొలగిస్తుండగా, కరెంట్షాక్తగిలి యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మహారాష్ట్ర నాందేడ్కు చెందిన లక్కీ (26) బొల్లారం రీసాలబజార్లోని ఓ టెంట్హౌస్లో కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఒక శుభకార్యం కోసం వేసిన టెంట్ను మున్నా, విజయ్, సంతోశ్తో కలిసి లక్కీ తొలగిస్తున్నాడు. ఇనుప నిచ్చెనపై నిలబడి టెంట్ను విప్పుతుండగా, కరెంట్షాక్తగిలింది. ఈ ఘటనలో నిచ్చెనపై ఉన్న వ్యక్తితో పాటు కింద ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా, లక్కీ మార్గమధ్యలో మృతి చెందాడు. మున్నా, విజయ్, సంతోశ్కు ట్రీట్మెంట్కొనసాగుతోంది.