నాణ్యమైన పరికరాలు వాడకనే విద్యుత్‌ ప్రమాదాలు

నాణ్యమైన పరికరాలు వాడకనే విద్యుత్‌ ప్రమాదాలు
  •      కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సన్మాన సభలో నేమాల బెనర్జీ 

హైదరాబాద్‌, వెలుగు: కాంట్రాక్టర్లు నాణ్యమైన పరికరాలు వాడకపోవడంతోనే విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని రాష్ట్ర లైసెన్సింగ్ బోర్డు నూతన మెంబర్ నేమలాల బెనర్జీ అన్నారు. రాష్ట్ర లైసెన్సింగ్ బోర్డు మెంబర్ గా ఎన్నికైన నేమాల బెనర్జీని హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బెనర్జీ మాట్లాడారు. కాంట్రాక్టర్లు ఎలక్ట్రికల్ వైరింగ్, మెటీరియల్ లో  నాణ్యత ప్రమాణాలు పాటించాలని బెనర్జీ కోరారు. నాణ్యమైన పరికరాలు వాడి విద్యుత్ ప్రమాదాలను అరికట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా బీ గ్రేడ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క యాదగిరి మాట్లాడుతూ.. విద్యుత్ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. వాటిని పరిష్కరించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.