బషీరాబాద్​లో కరెంట్ షాక్​తో ఎలక్ట్రీషియన్ మృతి

బషీరాబాద్​లో కరెంట్ షాక్​తో  ఎలక్ట్రీషియన్ మృతి

జీడిమెట్ల, వెలుగు : కరెంట్ షాక్​తో వ్యక్తి మృతిచెందిన ఘటన పేట్​బషీరాబాద్​లో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం... చింతల్​పరిధి బాపు నగర్​కి చెందిన పి.రాజుగౌడ్​ (37) ఎలక్ట్రీషియన్​. ఆదివారం తను అద్దెకు ఉండే ఇంట్లో ఫైబర్​కేబుల్​నుంచి స్పార్క్ వస్తుండగా, చెక్ చేయాలని అతడిని ఓనరు సురేఖ కోరింది.

దీంతో రాజుగౌడ్​మీటర్ మెయిన్​ స్విచ్​ఆఫ్ చేసి రిపేర్​చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్​ తగిలింది. దీంతో అతడి శరీరం కాలిపోయి కిందపడి చనిపోయాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

 ALSO READ :  నల్గొండలో మహిళా కౌన్సిలర్ పై దాడి  .. పరామర్శించేందుకు వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపైదాడికి యత్నం