ఫంక్షన్ హాల్కు కరెంటు కనెక్షన్ అడిగితే..

ఫంక్షన్ హాల్కు కరెంటు కనెక్షన్ అడిగితే..
  • లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన లైన్మ్యాన్ 

నల్గొండ జిల్లా:  ఫంక్షన్ హాలుకు కరెంటు కనెక్షన్ ఇమ్మని అడిగితే.. లంచం ఇవ్వనిదే కుదరదని చెప్పిన కరెంటు డిపార్టుమెంట్ అసిస్టెంట్ లైన్ మ్యాన్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడి వద్ద నుంచి 2500 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న ఘటన దామరచర్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 

ఫంక్షన్ హాల్ కి ట్రాన్స్ఫారం కనక్షన్ కోసం మోహన్ రెడ్డి అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. కనెక్షన్ కోసం కరెంటు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడు మోహన్ రెడ్డి నుంచి 2500 రూపాయలను అసిస్టెంట్ లైన్ మ్యాన్ బంటు సైదులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత కరెంటు ఆఫీసులోనూ.. ఆయన ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉండొచ్చనే అనుమానాలతో తనిఖీలు చేస్తున్నారు.