
సదాశివనగర్(కామారెడ్డి),వెలుగు: జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ప్రజలకు చేసింది శూన్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు విమర్శించారు. బుధవారం సదాశివనగర్, రామారెడ్డి మండలాల కార్యకర్తల మీటింగ్ సదాశివనగర్ మండలంలో నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండు సార్లు బీబీ పాటిల్ ఎంపీగా గెలిచినా నియోజకవర్గంలో ఆయన ఎక్కడ కూడా పర్యటించలేదన్నారు. ఆయా మండలాల్లో బీబీపాటిల్ పర్యటించకపోవటమే కాకుండా అభివృద్ధి కూడా చేయలేదన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి లీడర్, కార్యకర్త పని చేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.