
ఎల్లారెడ్డి,వెలుగు : ఎన్ఎస్ఎస్ నేషనల్ క్యాంప్నకు ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టూడెంట్ సమీర్ అహ్మద్ ఎంపికయ్యాడు. 2024 జనవరి3 నుంచి 12 వరకు హిమాచల్ ప్రదేశ్ లోని కులుమనాలి, ధర్మశాలలో జరిగే ఎన్ఎస్ఎస్ క్యాంపులో సమీర్ పాల్గొంటాడని కాలేజీ ప్రిన్సిపాల్ప్రవీణ్ కుమార్ తెలిపారు. సమీర్ను ప్రిన్సిపాల్, ప్రొగ్రాం ఆఫీసర్స్, లెక్చరర్స్, విద్యార్థులు అభినందించారు.