11 మంది రైల్వే సిబ్బందికి   భద్రత  అవార్డులు

11 మంది రైల్వే సిబ్బందికి   భద్రత  అవార్డులు

సికింద్రాబాద్​, వెలుగు: దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ డివిజన్లలో  పని చేస్తున్న  11 మంది ఉద్యోగులకు “మ్యాన్ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను సికింద్రాబాద్​లోని రైలు నిలయంలో సోమవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్  అరుణ్ కుమార్ జైన్ అందజేశారు.  అవార్డులు భద్రతా విధానాలను అనుసరించడంలో అలాగే ఇతర ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తాయని అరుణ్​ కుమార్​ జైన్​ అన్నారు.  

అనంతరం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జోన్ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి సంబంధించి జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. రైల్వే బోర్డు నిర్దేశించిన గడువులోగా పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.