ఈఎన్సీ అనిల్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బదిలీ వేటు.. మేడిగడ్డ బ్యారేజీకి గ్రౌటింగ్ చేయించిన అనిల్

ఈఎన్సీ అనిల్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బదిలీ వేటు.. మేడిగడ్డ బ్యారేజీకి గ్రౌటింగ్ చేయించిన అనిల్
  • నేరుగా ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశం
  • ఆయన స్థానంలో అంజద్ హుస్సేన్‌‌‌‌‌‌‌‌కు బాధ్యతలు
  • అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఈఈ నూనె శ్రీధర్​బదిలీని గతంలో అడ్డుకున్నారని ఆయనపై ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​ శాఖలో అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కాళేశ్వరంపై విజిలెన్స్​ఎంక్వైరీ రిపోర్ట్​ ఆధారంగా ఇప్పటికే 38 మంది అధికారులకు షోకాజ్​నోటీసులివ్వగా.. ఇప్పుడు ఈఎన్సీ (జనరల్) అనిల్​ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బదిలీ వేటు వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి గ్రౌటింగ్​ చేయడం, ఈఈ నూనె శ్రీధర్ ​ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్​ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటి వ్యవహారాల్లో అనిల్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సీరియస్‌‌‌‌‌‌‌‌గా ఉన్న ప్రభుత్వం.. తాజాగా ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

జూన్16నే అనిల్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేస్తూ ఇరిగేషన్​శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ రాహుల్ ​బొజ్జా ఉత్తర్వులు రెడీ చేయగా, వాటిని శుక్రవారం విడుదల చేశారు. వెంటనే ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని అనిల్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు.  
అనిల్​ స్థానంలో సీఈ (ఎంక్వైరీస్), ఈఎన్సీ (అడ్మిన్)​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహ్మద్ అంజద్​ హుస్సేన్‌‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. 

ఏకపక్షంగా మేడిగడ్డకు గ్రౌటింగ్.. ​

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో ఈఎన్సీ అనిల్​ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బ్యారేజీ కింద భారీ గొయ్యి పడగా, ఆ గొయ్యికి కాంక్రీట్‌‌తో ఆయన గ్రౌటింగ్​ చేయించారు. అయితే, దాన్ని నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) తీవ్రంగా తప్పుబట్టింది. తాము చెప్పకుండా గ్రౌటింగ్​ఎందుకు చేశారంటూ అప్పట్లోనే నిలదీసింది. 2023 అక్టోబర్​21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్​ కుంగిపోయింది. 

దీనిపై విచారణ జరిపించేందుకు ఎన్డీఎస్ఏకు కాంగ్రెస్​ ప్రభుత్వం రిఫర్​ చేసింది. దీంతో చంద్రశేఖర్​అయ్యర్​నేతృత్వంలో నిపుణుల కమిటీని ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన కమిటీ.. 2024 జూన్‌‌లో తీసుకోవాల్సిన తాత్కాలిక చర్యలను సిఫార్సు చేస్తూ మధ్యంతర నివేదికను అందజేసింది. బ్యారేజీ వద్ద జియోటెక్నికల్, జియోఫిజికల్​ టెస్టులు చేయాలంటూ సూచించింది. అయితే టెస్టులు చేయడానికన్నా ముందే.. జూన్‌‌లోనే బ్యారేజీ గొయ్యికి ఈఎన్సీ అనిల్​ గ్రౌటింగ్​చేయించారు. 

దీంతో ఆ ప్రాంతంలో జియోటెక్నికల్​ఇన్వెస్టిగేషన్స్​ చేయించలేకపోయారు. ఫలితంగా ఎన్డీఎస్ఏ ఫైనల్​ రిపోర్టు ఆలస్యమైంది. రిపోర్టు కోసం మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి, అధికారులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్ఏ అధికారులతో భేటీ కాగా.. గ్రౌటింగ్‌‌పై వాళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రౌటింగ్​ చేయడం వల్ల బ్యారేజీ కుంగిన ప్రదేశంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీల్లేకుండా ఒరిజినల్​ స్ట్రాటా మొత్తం పోయిందని ఆక్షేపించారు. జియోటెక్నికల్​టెస్టులు చేయకుండా రిపోర్టు ఎలా ఇచ్చేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈఎన్సీ అనిల్‌‌పై అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. ఆయన వివరణ కోరింది. గ్రౌటింగ్​ చేయకుంటే బ్యారేజీకి ప్రమాదం జరిగి ఉండేదని అనిల్​ వివరణ ఇచ్చారు. 

కాళేశ్వరం కమిషన్​ కూడా సీరియస్..​

కాళేశ్వరం జ్యుడీషియల్​కమిషన్​ కూడా ఈఎన్సీ అనిల్​ తీరుపై మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్యారేజీల వద్ద పరిస్థితిపై స్టడీ చేసి రిపోర్టు ఇచ్చేందుకు  కమిషన్​అనిల్​ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. బ్యారేజీల్లో లోపాల గురించి కమిషన్‌‌కు తెలియజేసేందుకు కమిటీ సాయం చేయాల్సి ఉంది. కాగా, అక్కడ తీసుకోవాల్సిన తాత్కాలిక ఉపశమన చర్యలపై ఎన్డీఎస్ఏ సిఫార్సులకు అనుగుణంగా చేపట్టాలని టర్మ్స్​ఆఫ్​ రిఫరెన్స్​లోనూ కమిషన్  సూచించింది. 

కానీ, అనిల్​ఏకపక్షంగా గ్రౌటింగ్​చేశారని కమిషన్​  సీరియస్​ అయినట్టు సమాచారం. కమిషన్ విచారణలోనూ జోక్యం చేసుకుంటున్నారని అనిల్‌‌పై అసహనం వ్యక్తం చేసింది. విచారణ ఎదుర్కొంటున్న ఇంజినీర్లందరూ కమిషన్​ముందు ఒకే సమాధానం చెప్పేలా అనిల్​పురిగొల్పారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. అనిల్‌‌పై బదిలీ వేటు వేసింది. నేరుగా ప్రభుత్వానికే రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది.

శ్రీధర్ ట్రాన్స్‌‌ఫర్ విషయంలోనూ..  

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ప్రస్తుతం ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్న ఈఈ నూనె శ్రీధర్‌‌‌‌కూ ఈఎన్సీ అనిల్​లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు సంబంధించి నిరుడు జూన్‌‌లో నూనె శ్రీధర్‌‌‌‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈఎన్సీ (జనరల్)​ ఆఫీసుకు రిపోర్టు చేయాలని ఆదేశించింది. అయితే, ఆ ట్రాన్స్‌‌ఫర్​ ఉత్తర్వులను కాదని పనిచేస్తున్న చోటే నూనె శ్రీధర్‌‌‌‌ను అనిల్​ కొనసాగించారన్న ఆరోపణలు ఉన్నాయి. 

అయితే మంత్రి ఉత్తమ్‌‌తో చర్చించాకే ఆయనను కొనసాగించామని, సెక్రటరీ రాహుల్ బొజ్జాకు కూడా ఈ విషయాన్ని తెలియజేశామని అనిల్​చెబుతున్నా.. సర్కార్ ఉత్తర్వులను కాదని శ్రీధర్‌‌‌‌ను కొనసాగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.