
- నేరుగా ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశం
- ఆయన స్థానంలో అంజద్ హుస్సేన్కు బాధ్యతలు
- అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఈఈ నూనె శ్రీధర్బదిలీని గతంలో అడ్డుకున్నారని ఆయనపై ఆరోపణలు
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ శాఖలో అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కాళేశ్వరంపై విజిలెన్స్ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా ఇప్పటికే 38 మంది అధికారులకు షోకాజ్నోటీసులివ్వగా.. ఇప్పుడు ఈఎన్సీ (జనరల్) అనిల్ కుమార్పై బదిలీ వేటు వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి గ్రౌటింగ్ చేయడం, ఈఈ నూనె శ్రీధర్ ట్రాన్స్ఫర్ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటి వ్యవహారాల్లో అనిల్ కుమార్పై సీరియస్గా ఉన్న ప్రభుత్వం.. తాజాగా ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జూన్16నే అనిల్ కుమార్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఇరిగేషన్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు రెడీ చేయగా, వాటిని శుక్రవారం విడుదల చేశారు. వెంటనే ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని అనిల్ను ఆదేశించారు.
అనిల్ స్థానంలో సీఈ (ఎంక్వైరీస్), ఈఎన్సీ (అడ్మిన్)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహ్మద్ అంజద్ హుస్సేన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఏకపక్షంగా మేడిగడ్డకు గ్రౌటింగ్..
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో ఈఎన్సీ అనిల్ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బ్యారేజీ కింద భారీ గొయ్యి పడగా, ఆ గొయ్యికి కాంక్రీట్తో ఆయన గ్రౌటింగ్ చేయించారు. అయితే, దాన్ని నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) తీవ్రంగా తప్పుబట్టింది. తాము చెప్పకుండా గ్రౌటింగ్ఎందుకు చేశారంటూ అప్పట్లోనే నిలదీసింది. 2023 అక్టోబర్21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ కుంగిపోయింది.
దీనిపై విచారణ జరిపించేందుకు ఎన్డీఎస్ఏకు కాంగ్రెస్ ప్రభుత్వం రిఫర్ చేసింది. దీంతో చంద్రశేఖర్అయ్యర్నేతృత్వంలో నిపుణుల కమిటీని ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన కమిటీ.. 2024 జూన్లో తీసుకోవాల్సిన తాత్కాలిక చర్యలను సిఫార్సు చేస్తూ మధ్యంతర నివేదికను అందజేసింది. బ్యారేజీ వద్ద జియోటెక్నికల్, జియోఫిజికల్ టెస్టులు చేయాలంటూ సూచించింది. అయితే టెస్టులు చేయడానికన్నా ముందే.. జూన్లోనే బ్యారేజీ గొయ్యికి ఈఎన్సీ అనిల్ గ్రౌటింగ్చేయించారు.
దీంతో ఆ ప్రాంతంలో జియోటెక్నికల్ఇన్వెస్టిగేషన్స్ చేయించలేకపోయారు. ఫలితంగా ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్టు ఆలస్యమైంది. రిపోర్టు కోసం మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, అధికారులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్ఏ అధికారులతో భేటీ కాగా.. గ్రౌటింగ్పై వాళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రౌటింగ్ చేయడం వల్ల బ్యారేజీ కుంగిన ప్రదేశంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీల్లేకుండా ఒరిజినల్ స్ట్రాటా మొత్తం పోయిందని ఆక్షేపించారు. జియోటెక్నికల్టెస్టులు చేయకుండా రిపోర్టు ఎలా ఇచ్చేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈఎన్సీ అనిల్పై అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. ఆయన వివరణ కోరింది. గ్రౌటింగ్ చేయకుంటే బ్యారేజీకి ప్రమాదం జరిగి ఉండేదని అనిల్ వివరణ ఇచ్చారు.
కాళేశ్వరం కమిషన్ కూడా సీరియస్..
కాళేశ్వరం జ్యుడీషియల్కమిషన్ కూడా ఈఎన్సీ అనిల్ తీరుపై మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్యారేజీల వద్ద పరిస్థితిపై స్టడీ చేసి రిపోర్టు ఇచ్చేందుకు కమిషన్అనిల్ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. బ్యారేజీల్లో లోపాల గురించి కమిషన్కు తెలియజేసేందుకు కమిటీ సాయం చేయాల్సి ఉంది. కాగా, అక్కడ తీసుకోవాల్సిన తాత్కాలిక ఉపశమన చర్యలపై ఎన్డీఎస్ఏ సిఫార్సులకు అనుగుణంగా చేపట్టాలని టర్మ్స్ఆఫ్ రిఫరెన్స్లోనూ కమిషన్ సూచించింది.
కానీ, అనిల్ఏకపక్షంగా గ్రౌటింగ్చేశారని కమిషన్ సీరియస్ అయినట్టు సమాచారం. కమిషన్ విచారణలోనూ జోక్యం చేసుకుంటున్నారని అనిల్పై అసహనం వ్యక్తం చేసింది. విచారణ ఎదుర్కొంటున్న ఇంజినీర్లందరూ కమిషన్ముందు ఒకే సమాధానం చెప్పేలా అనిల్పురిగొల్పారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. అనిల్పై బదిలీ వేటు వేసింది. నేరుగా ప్రభుత్వానికే రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది.
శ్రీధర్ ట్రాన్స్ఫర్ విషయంలోనూ..
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ప్రస్తుతం ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్న ఈఈ నూనె శ్రీధర్కూ ఈఎన్సీ అనిల్లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు సంబంధించి నిరుడు జూన్లో నూనె శ్రీధర్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈఎన్సీ (జనరల్) ఆఫీసుకు రిపోర్టు చేయాలని ఆదేశించింది. అయితే, ఆ ట్రాన్స్ఫర్ ఉత్తర్వులను కాదని పనిచేస్తున్న చోటే నూనె శ్రీధర్ను అనిల్ కొనసాగించారన్న ఆరోపణలు ఉన్నాయి.
అయితే మంత్రి ఉత్తమ్తో చర్చించాకే ఆయనను కొనసాగించామని, సెక్రటరీ రాహుల్ బొజ్జాకు కూడా ఈ విషయాన్ని తెలియజేశామని అనిల్చెబుతున్నా.. సర్కార్ ఉత్తర్వులను కాదని శ్రీధర్ను కొనసాగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.