చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

చత్తీస్ గడ్ లో  ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు  మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి.  ములుగు జిల్లా వెంకటపూర్ మండలం కర్రగుట్ట దగ్గర జరిగిన ఈ కాల్పుల్లో  ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.  మృతదేహాలతో పాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

 ఏకే 47,  ఎల్ ఎమ్ జీ1 స్వాధీనం చేసుకున్నారు. ఈ కూంబింగ్ లో  తెలంగాణ గ్రేహౌండ్స్   పాల్గొన్నారు. బీజాపూర్ లో  ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లో కూడా 13 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.