పుల్వామాలో ఎన్ కౌంటర్: ఇద్దరు టెర్రరిస్టులు హతం

పుల్వామాలో ఎన్ కౌంటర్: ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూ కశ్మీర్: పుల్వామా లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మిలిటెంట్లు మృతిచెందారు. జమ్ము కశ్మీర్ పుల్వామాలోని డ్రాబ్ గమ్ ఏరియాలోని మిలటరీ చెక్ పోస్ట్ పై సోమవారం సాయంత్రం మిలిటెంట్లు కాల్పులు జరిపారు.. దీంతో రివర్స్ ఫైర్ చేసిన భద్రతా బలగాల చేతిలో ఇద్దరు టెర్రరిస్టులు మృతిచెందారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరుగగా విషయం లేటుగా బయటకు వచ్చింది. మృతిచెందిన టెర్రరిస్టులు ఇర్ఫాన్, రియాజ్ గా గుర్తించారు. వీరు 2017లో భద్రతా బలగాలపై దాడాచేశారు.