అధికారుల అనుమతులు పటేల్ చెరువులో బిల్డింగులు!... బఫర్ జోన్ ఆక్రమించిన కబ్జారాయుళ్లు

అధికారుల అనుమతులు పటేల్ చెరువులో బిల్డింగులు!... బఫర్ జోన్ ఆక్రమించిన కబ్జారాయుళ్లు
  •     ఇరిగేషన్ ​ఎన్​వోసీ..బల్దియా గ్రీన్ ​సిగ్నల్​
  •     విచారణలో ఆక్రమణ నిజమేనన్న అధికారులు  
  •     చర్యలు తీసుకోవాలంటూ రెవెన్యూ, హైడ్రా, బల్దియాలకు ఇరిగేషన్​ లెటర్లు  
  •     ఇప్పటివరకు నో యాక్షన్​ 
  •     ఇప్పటికే ఒక బిల్డింగ్​ పూర్తి 

మియాపూర్​, వెలుగు :  హైడ్రా, మున్సిపల్, ఇరిగేషన్​, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో శేరిలింగంపల్లి మండలం మదీనగూడలో...ఎమ్మెల్యే క్యాంపు అఫీస్​కు కూతవేటు దూరంలో ఉన్న మియాపూర్​పటేల్​చెరువు ఆక్రమణకు గురవుతోంది. 48.936 ఎకరాల్లో ఈ చెరువు ఉండగా, కట్ట(బండ్​) కింద కృషినగర్​ఉంది. ఈ బఫర్​జోన్ 9 మీటర్ల వరకు ఉంటుంది. బఫర్​లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దనే రూల్స్​ఉన్నాయి. అయితే, గజం ధర రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతుండడంతో బఫర్​జోన్​ను ఆక్రమించి మూడు బిల్డింగులు కడుతున్నారు. పైగా, ఈ బిల్డింగులకు గతంలో ఇక్కడ ఇరిగేషన్​ ఏఈగా పని చేసి ప్రమోషన్​పై వెళ్లిన ఓ లేడీ ఆఫీసర్​ఎన్ఓసీ ఇస్తే, శేరిలింగంపల్లి జోనల్​టౌన్​ప్లానింగ్​ఆఫీసర్ భవన నిర్మాణానికి అనుమతిచ్చేశారు. 

ఇప్పటికే ఓ భారీ భవన సముదాయం పూర్తికాగా, మరో రెండు బిల్డింగుల పనులు కొనసాగుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...బఫర్​జోన్​లో బిల్డింగులు కడుతున్నారని కంప్లయింట్స్​వస్తే విచారణ జరిపి నిజనేనని తేల్చినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. హైడ్రా, రెవెన్యూ, టౌన్​ ప్లానింగ్ ఆఫీసర్లు యాక్షన్ లోకి దిగాలంటూ ఇరిగేషన్​శాఖ లెటర్లు రాసి చేతులు దులుపుకుంటోంది. అయితే, 

ఇరిగేషన్​ ఎన్​వోసీ.. మున్సిపల్ ​నిర్మాణ అనుమతులు  

బఫర్​జోన్​పరిధిలో ఉన్న కృషినగర్​కాలనీలోని ప్లాట్​నెంబర్ 331,332 పార్ట్​ లలో భవన నిర్మాణాలు చేపట్టేందుకు జేఆర్​ఎలిగెంట్​ఇన్​ఫ్రాకు ఇరిగేషన్​శాఖ ఎన్ఓసీ ఇచ్చింది. నిర్మాణానికి అప్పటి జీహెచ్ఎంసీ(ప్రస్తుతం సీఎంసీ) పరిధిలోని శేరిలింగంపల్లి జోనల్​సిటీ ప్లానర్​కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగానే 4 అంతస్థుల నిర్మాణానికి గత సంవత్సరం ఫిబ్రవరి 1న జోనల్​ కమిషనర్​పర్మిషన్​ఇచ్చారు. 

దీంతో నిర్మాణదారులు శరవేగంగా పనులు చేపట్టారు. ఇదే కాలనీలో లోటస్​ఇన్​ఫ్రా ప్రాజెక్ట్స్​అనే నిర్మాణ సంస్థ కంపౌండ్​వాల్, భవన సెట్​బ్యాక్​ఏరియాతో పాటు బిల్డింగ్​లో కొంత భాగం వరకు బఫర్​జోన్​ను ఆక్రమించి నిర్మించారు. దీనికి కూడా ఇరిగేషన్​ఎన్​ఓసీ ఇవ్వగా, అప్పటి జీహెచ్​ఎంసీ హెడ్డాఫీసు నుంచి అనుమతి కూడా ఇచ్చారు. 

లెటర్లు రాసినా నో రెస్పాన్స్​

పటేల్ చెరువు బఫర్​జోన్​ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు జనవరి 23న ఇరిగేషన్​అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో హుస్సేన్​సాగర్​ లేక్స్​డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్​ఇంజినీర్​కె. రాజశేఖర్​తన సిబ్బందితో కలిసి బఫర్​ జోన్​లో సర్వే చేశారు. రెండు నిర్మాణ సంస్థలు బఫర్ జోన్​ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారించారు. చర్యలు తీసుకోవాలంటూ ఫిబ్రవరి7 తేదీన శేరిలింగంపల్లి తహసీల్దార్​కు ఇరిగేషన్​శాఖ అధికారులు లెటర్​రాశారు. అలాగే, ఫిబ్రవరి 21న జోనల్​కమిషనర్​కు, హైడ్రా కమిషనర్లకు యాక్షన్​తీసుకోవాలంటూ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​మల్లేశ్​లెటర్లు రాశారు. అయితే, ఇప్పటివరకు ఎవరూ యాక్షన్​తీసుకోలేదు.   

ఎవరేమన్నారంటే...

చెరువు బఫర్​జోన్​ఆక్రమణ గురించి శేరిలింగంపల్లి తహసీల్దార్​మహిపాల్​రెడ్డిని వివరణ కోరగా, ‘ఇరిగేషన్​శాఖ ఎన్​వోసీ ఇచ్చి తమను చర్యలు తీసుకోమంటే ఎలాగ..వాళ్లు ఎన్​వోసీ రద్దు చేసి జాయింట్​సర్వేకు వస్తే అప్పుడు చర్యలు తీసుకుంటాం’ అని సమాధానం ఇచ్చారు. హైడ్రా అధికారులను అడగ్గా ‘మాకు బఫర్​జోన్​లో ఉంది..కూల్చివేయండి అని లెటర్​రాస్తేనే యాక్షన్​తీసుకుంటాం’ అని చెప్పారు. 

అయితే, మూడింటిలో ఒక బిల్డింగ్​నిర్మాణం పూర్తి కాగా, మరో రెండు భవనాల నిర్మాణాలు ఫాస్ట్​గా కొనసాగుతున్నాయి. ఒక బిల్డింగులో కొన్ని ఫ్యామిలీలు వచ్చి ఉంటుండగా, ప్లాన్​ప్రకారం కట్టలేదని బల్దియా ఎన్​వోసీ ఇవ్వలేదు. జాయింట్​సర్వే చేసే లోపు మిగతా రెండు బిల్డింగుల నిర్మాణాలు కూడా పూర్తవుతాయని, తొందరగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

 జాయింట్​ సర్వే చేసి  చర్యలు తీసుకుంటాం.. 

పటేల్​చెరువు బఫర్​జోన్​ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తే సర్వే నిర్వహించి ఆక్రమణలు నిజమేనని నిర్ధారించాం. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని హైడ్రా, రెవెన్యూ, టౌన్​ ప్లానింగ్​కు లెటర్లు రాశాం. త్వరలోనే అన్ని శాఖల అధికారులతో కలిసి జాయింట్​సర్వే చేసి చర్యలు తీసుకుంటాం.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ - గులాముద్దీన్​, ఏఈ ఇరిగేషన్​