సూర్యపేట: దురదృష్టవశాత్తు రాష్ట్రంలో బాధ్యత లేని ప్రతిపక్షాలు ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సస్పెన్షన్కు గురైన బీజేపీ శాసనసభ్యులు న్యాయపోరాటం చేస్తామనడంపై ఆయన మండిపడ్డారు. అంతర్జాతీయ మహిళదినోత్సవం సందర్భంగా సూర్యపేట నియోజకవర్గంలోని కాసారా బాద్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ప్రజారంజక పాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసెంబ్లీని అడ్డుకుంటున్నాయి. ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా ప్రతిపక్షాలు వ్యవహరించడంలేదు. సభలో నిలబడి మాట్లాడే ధైర్యంలేక సభను ఆడ్డుకుంటున్నారు. సభను సరైన పద్ధతుల్లో నిర్వహించేందుకు నిబందనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. తీర్మానాలను ఉల్లంఘించి బీజేపీ సభ్యులు వెల్లోకి దూసుకోచ్చారు. సభను అడ్డుకుంటామనే బీజేపీ చిల్లర ఆటలు ఇక సాగవు. ప్రతి ఒక సభ్యుడు సభా మర్యాదలకు అనుగుణంగా నడుచుకోవాలి. కోర్టుకు వెళ్లినంత మాత్రాన ఏమీ జరగదు. కేంద్రం చేస్తున్న సహాయ నిరాకరణను శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేశాం’ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
అంతర్జాతీయ మహిళదినోత్సవం సందర్భంగా సూర్యపేట నియోజకవర్గం, కసారా బాద్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ &షాది ముబారక్ చెక్కులు అందించిన మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి.#MahilaBandhuKCR #ThankYouKCR #WomensDay2022 pic.twitter.com/NGRL9tEkDg
— Jagadish Reddy G (@jagadishTRS) March 8, 2022