
లండన్: ఇంగ్లండ్ పేసర్ జెమీ ఓవర్టన్.. వెస్టిండీస్తో జరిగే వన్డే, టీ20 సిరీస్ మ్యాచ్లకు దూరమయ్యాడు. గురువారం జరిగిన తొలి వన్డేలో రిటర్న్ క్యాచ్ పట్టే క్రమంలో అతని కుడి చిటికెన వేలికి బలంగా తాకింది. వెంటనే డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి చికిత్స తీసుకుని మళ్లీ గ్రౌండ్లోకి వచ్చి బౌలింగ్ చేశాడు. తర్వాత స్కానింగ్లో ఎముక విరిగినట్లు తేలడంతో అతన్ని సిరీస్ నుంచి తప్పించారు. ప్రస్తుతం అతను ఇంగ్లండ్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉంటాడని ఈసీబీ వెల్లడించింది. కాగా, ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు యూపీకి చెందిన యుధ్వీర్ సింగ్ ఇండియా టీమ్ మేనేజర్గా అపాయింట్ అయ్యాడు.