మరొకరి ఎగ్జామ్ రాస్తూ పట్టుబడ్డ ఇంజినీరింగ్ ​స్టూడెంట్​

మరొకరి ఎగ్జామ్ రాస్తూ పట్టుబడ్డ ఇంజినీరింగ్ ​స్టూడెంట్​

కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఒకరు రాయాల్సిన పదో తరగతి పరీక్షను మరొకరు రాస్తూ పట్టుబడ్డారు. మఠంపల్లి మండలం పెదవీడు జడ్పీ స్కూల్​కు చెందిన బానోతు హనుమ కోదాడ సిటీ సెంట్రల్​స్కూల్​లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ రాస్తున్నాడు. శుక్రవారం సైన్స్ ఎగ్జామ్​ ఉండడంతో అతని స్థానంలో మఠంపల్లి మండలం కృష్ణ తండాకు చెందిన ఇంజినీరింగ్ ​స్టూడెంట్​ పానగల్లు మంజునాథ పరీక్షకు హాజరయ్యాడు. ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్న శైలజ సంతకం చేస్తున్నప్పుడు మంజునాథపై అనుమానం వచ్చింది. హాల్ టికెట్​పై ఉన్న ఫొటోకు, పరీక్ష రాస్తున్న వ్యక్తికి తేడా ఉండడంతో సెంటర్ ​చీఫ్ సూపరింటెండెంట్ ​రాజు దృష్టికి తీసుకెళ్లింది.  ఆయన మరోసారి క్రాస్ ​చెక్ ​చేసుకుని ఒకరి పరీక్షను మరొకరు రాస్తున్నారని నిర్ధారించుకుని  పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోదాడ ఎస్ఐ నాగభూషణం సెంటర్​కు వచ్చి మంజునాథపై కేసు నమోదు చేసి కోదాడ పోలీస్​స్టేషన్ కు తరలించారు.