ఇంగ్లండ్‌‌‌‌దే తొలి టీ20.. 7 వికెట్ల తేడాతో కివీస్ పై గెలుపు

ఇంగ్లండ్‌‌‌‌దే తొలి టీ20.. 7 వికెట్ల తేడాతో కివీస్ పై గెలుపు

చెస్టర్‌‌‌‌ లీ స్ట్రీట్‌‌‌‌: టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో డేవిడ్‌‌‌‌ మలన్‌‌‌‌ (54), హ్యారీ బ్రూక్‌‌‌‌ (43 నాటౌట్‌‌‌‌) చెలరేగడంతో.. న్యూజిలాండ్‌‌‌‌తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌‌‌‌ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో నాలుగు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో ఇంగ్లీష్‌‌‌‌ టీమ్‌‌‌‌ 1–0 ఆధిక్యంలో నిలిచింది. 

టాస్‌‌‌‌ గెలిచి ఇంగ్లండ్‌‌‌‌ ఫీల్డింగ్‌‌‌‌ ఎంచుకోగా, బ్యాటింగ్‌‌‌‌కు దిగిన కివీస్‌‌‌‌ 20 ఓవర్లలో 139/9 స్కోరుకే పరిమితమైంది. గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌ (41) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. ఫిన్‌‌‌‌ అలెన్‌‌‌‌ (21) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. లుక్‌‌‌‌ వుడ్‌‌‌‌, బ్రైడన్‌‌‌‌ కార్సీ చెరో మూడు వికెట్లు తీశారు. 

తర్వాత ఇంగ్లండ్‌‌‌‌ 14 ఓవర్లలో 143/3 స్కోరు చేసి గెలిచింది. జానీ బెయిర్‌‌‌‌స్టో (4) ఫెయిలైనా, విల్‌‌‌‌ జాక్‌‌‌‌ (22), మలన్‌‌‌‌, బ్రూక్‌‌‌‌ కీలక పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్స్‌‌‌‌తో ఆకట్టుకున్నారు.