ODI World Cup 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. సెమీస్‌పై భారత్ దృష్టి  

ODI World Cup 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. సెమీస్‌పై భారత్ దృష్టి  

వరల్డ్ కప్ లో మరో సమరానికి భారత్ సిద్ధమైంది. పటిష్టమైన ఇంగ్లాండ్ తో లక్నో వేదికగా మ్యాచ్ ఆడబోతుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో గెలిచిన భారత్ ఈ మ్యాచులో గెలిస్తే సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. మరోవైపు ఇంగ్లాండ్ ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో కనబడుతుంది. ఒకవేళ ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. 

ఇక ఈ  మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఇరు జట్లు ఎలాంటి మార్పలు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. మరి ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి సెమీస్ కు చేరుకుంటుందో లేకపోతే ఇంగ్లాండ్ గెలిచి సెమీస్ రేస్ లో ఉంటుందో చూడాలి. 
               
భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI):

జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్, వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వూ