ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్(ECR) ఫైలింగ్కు సంబంధించి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) తో ఆధార్ నెంబర్ లింక్ గడువును కరోనా కారణంగా పొడిగించింది. గతంలో జూన్ 1 వరకు ఉన్న UAN-ఆధార్ లింకింగ్ గడువును EPFO సెప్టెంబర్ 1 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ECR దాఖలు చేయడానికి కచ్చితంగా UAN నెంబర్తో ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
EPFO తన అధికారులకు ఈ విషయాన్ని ఇప్పటికే తెలియజేసింది. దీంతో ఇప్పటివరకు UAN తో ఆధార్ లింక్ చేయకపోయినా కూడా ఇప్పుడు ECR దాఖలు చేయొచ్చు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తమ ఉద్యోగులకు ఆధార్ నెంబర్ను PF ఖాతాలు లేదా UANతో లింక్ చేయడానికి యజమానులకు ఎక్కువ సమయం లభించింది. EPFO సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని సెక్షన్ 142లో కొన్ని మార్పులు చేసింది. ECR దాఖలు చేసే నియమాలు, విధానంలో సవరణలు చేసింది. ఒకవేల ఆధార్ తో మీ ఖాతా లేదా యుఎఎన్ నెంబర్ లింకు చేయకపోతే మీ ఖాతాలో కంపెనీలు అందజేసే EPF కాంట్రిబ్యూషన్ను నిలిపివేసే అవకాశం ఉంది.