ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును అడ్డుకున్న ఎర్దండి గ్రామస్తులు

ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును అడ్డుకున్న ఎర్దండి గ్రామస్తులు

జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును ఎర్దండి గ్రామస్తులు అడ్డుకున్నారు. గోదావరి ప్రవాహం తగ్గడంతో ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామస్తులను పరామర్శించడానికి ఎమ్మెల్యే వెళ్లారు. అయితే మా ఊరికి ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తూ గ్రామస్తులు ఆయనను అడ్డుకున్నారు. 30ఏళ్ల క్రితం ఎర్దండి మల్లన్న గుట్టకు అప్పటి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మరొకరికి కట్టబెట్టిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. గ్రామస్తుల నిరసనతో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు.