ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాప్ చేశారు: ఈటల

ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాప్ చేశారు: ఈటల

ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం (జూన్ 24) విచారణకు హాజరయ్యారు బీజేపీ ఎంపీ ఈటల.  ఈ కేసులో ఎంపీ ఈటల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్). అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు ఈటల.

ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో అనేక సార్లు తన ఫోన్ ట్యాప్ చేసినట్లు ఈటల చెప్పారు. 2023 ఎన్నికల సమయంలోనూ ట్యాప్ చేసినట్లు తెలిపారు. 

తన ఇష్టానికి పనిచేసే వారిని కేసీఆర్ నియమించుకున్నారని.. దీంతో ఫోన్ ట్యాపింగ్ చేయించడం వంటి చట్ట విరుద్ధమైన పనులు చేసినట్లు చెప్పారు. SIB (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ బ్రాంచ్) చీఫ్ ప్రభాకర్ రావును కూడా అలాగే నియమించుకున్నారని తెలిపారు. బాధ్యులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈటల. 

►ALSO READ | Gautam Adani: ఆపరేషన్ సిందూర్‌లో అదానీ గ్రూప్ కీలక పాత్ర.. గాల్లోనే శత్రువుపై విధ్వంసం..