విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం

విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం

సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్టం అనిచెప్పే ముఖ్యమంత్రి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. గాలికి దీపంపెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మంత్రులందరినీ బానిస వ్యవస్థగా తయారు చేశారన్నారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. తాను ఇంజినీరింగ్ అనే చెప్పుకునే ముఖ్యమంత్రి  అన్నారం, మేడిగడ్డ పంప్ హౌస్ లు ఎందుకు నీట మునిగాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నిరో చక్రవర్తి లాగా వ్యవహరిన్నారని ఆరోపించారు.  ప్రభుత్వం నడిపే సత్తలేకపోతే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.