
కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి హుజురాబాద్ లో పోరాటం జరుగుతోందన్నారు మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. పెట్రోల్, గ్యాస్ పై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించడం లేదా అని ప్రశ్నించారు. గ్యాస్ పై పన్నుల రూపంలో 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పారు. ఆడబిడ్డలపై టీఆర్ఎస్ వాళ్లకు ప్రేమ ఉంటే.. రాష్ట్ర పన్నులు తగ్గించాలన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచారంటూ.. కేంద్రంపై నిందలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్నది సిలిండర్ల పంచాయతీ కాదని.. ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. గెలిచేది తానే అన్నారు. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మమే గెలుస్తుందని తెలిపారు ఈటల.