సైబర్ నేరస్తుడి అరెస్ట్.. ఖమ్మంలో విద్యార్థులను మోసం చేసిన నిందితుడు హైదరాబాద్ లో అరెస్ట్

సైబర్  నేరస్తుడి అరెస్ట్.. ఖమ్మంలో  విద్యార్థులను మోసం చేసిన నిందితుడు హైదరాబాద్ లో అరెస్ట్

ఖమ్మం టౌన్, వెలుగు: ఆన్​లైన్ లో నకిలీ పత్రాలు, ఎంవోయూ పేరుతో విద్యార్థులకు ట్రైనింగ్స్  ఇస్తామని నమ్మించి  రూ.10 లక్షలు కాజేసిన కేసులో నిందితుడిని హైదరాబాద్ లో అరెస్ట్​ చేసినట్లు సైబర్  క్రైమ్  డీఎస్పీ ఫణిందర్  తెలిపారు. శుక్రవారం డీఎస్పీ ఆఫీస్​లో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. 

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థకు వాట్సాప్ లో ఐఐటీ హైదరాబాద్  ప్రొఫెసర్ గా పరిచయం చేసుకొని, కాలేజీ విద్యార్థులకు ట్రైనింగ్​ ఇస్తామని చెప్పి నకిలీ డాక్యుమెంట్స్, నకిలీ ఎంఓయూను ఆన్​లైన్ లో పంపించి డి.రవి కిరణ్(26) కాజేశాడు. నిందితుడిని అరెస్ట్​ చేసి రిమాండ్ కు తరలించామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు.