ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్‌‌ బదిలీ

ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్‌‌ బదిలీ

ఏటూరునాగారం, వెలుగు : ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్‌‌ ట్రాన్స్‌‌ఫర్ అయ్యారు. ఆయనను నిజామాబాద్‌‌ అడిషనల్‌‌ కలెక్టర్‌‌గా నియమిస్తూ సీఎస్‌‌ శాంతికుమారి సోమవారం రాత్రి ఆర్డర్స్‌‌ జారీ చేశారు. ఆయన స్థానంలో నిజామాబాద్‌‌ అడిషనల్‌‌ కలెక్టర్‌‌గా పనిచేస్తున్న చిత్రా మిశ్రాను నియమించారు.