
ఏటూరునాగారం, వెలుగు : టమాట లోడు పేరుతో పశువులను తరలిస్తున్న వ్యక్తులను ఏటూరునాగారం పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతం నుంచి టమాట లోడుతో వస్తున్న ఓ డీసీఎంను ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వద్ద సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్ ఆపారు.
డీసీఎంను తనిఖీ చేయగా టమాట ట్రేల కింది భాగంలో పశువులు కనిపించాయి. డ్రైవర్ పెరుమాండ్ల లక్ష్మణ్ను విచారించగా.. పశువులను చర్ల నుంచి హైదరాబాద్లోని కబేళాకు తరలిస్తున్నట్లు తేలింది. డ్రైవర్పై కేసు నమోదు చేసి, 17 పశువులను భూపాలపల్లి జిల్లాలోని గోశాలకు తరలించినట్లు తెలిపారు. పశువులను పట్టుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్ను ఏఎస్పీ అభినందించారు.