సెప్టెంబర్ 16న యూరో ప్రతీక్ ఐపీఓ

సెప్టెంబర్ 16న యూరో ప్రతీక్ ఐపీఓ

న్యూఢిల్లీ: డెకరేటివ్​ వాల్​ ప్యానెల్​ ఇండస్ట్రీ యూరో ప్రతీక్ సేల్స్​ లిమిటెడ్ ​, రూ.451.32 కోట్ల విలువైన ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫరింగ్​ (ఐపీఓ)  ప్రైస్​బ్యాండ్​ను రూ.235 నుంచి రూ.247 మధ్య నిర్ణయించింది. ఈ ఐపీఓ సెప్టెంబర్ 16న సబ్​స్క్రిప్షన్​ కోసం ప్రారంభమై, సెప్టెంబర్ 18న ముగుస్తుంది. ఈ పబ్లిక్​ ఇష్యూలో ప్రమోటర్ల ద్వారా రూ.451.32 కోట్ల షేర్ల అమ్మకం మాత్రమే ఉంటుంది. 

కొత్తగా షేర్లను జారీ చేయడం లేదు. యూరో ప్రతీక్​ రెసిడెన్షియల్,​కమర్షియల్​ అవసరాల కోసం చాలా రకాల వస్తువులను తయారు చేస్తోంది. వీటిని యూరో ప్రతీక్, గ్లోరియో బ్రాండ్ల కింద అమ్ముతుంది. మార్చి 31, 2025 నాటికి, దీని పంపిణీ నెట్​వర్క్​ దేశంలోని 116 నగరాలకు విస్తరించింది.  180 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 28 శాతం పెరిగి రూ.284.23 కోట్లకు చేరింది. నికరలాభం 21.51 శాతం పెరిగి రూ.76.44 కోట్లకు చేరుకుంది.