జపాన్ లో భారీ భూకంపం..న్యూక్లియర్ ప్లాంట్లు సేఫ్

జపాన్ లో భారీ భూకంపం..న్యూక్లియర్ ప్లాంట్లు సేఫ్

టోక్యో : భారీ భూకంపానికి జపాన్ వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. సోమవారం సాయంత్రం 90‌‌‌‌ నిమిషాల్లో 21 సార్లు భూమి కంపించింది. ప్రతి సారీ రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత కనీసం 4.0 పైనే నమోదైందని జపాన్ వాతావరణ శాఖ ప్రకటించింది. జపాన్​లోని ఇషికావా, నైగటా, టయోమా, నోటో రాష్ట్రాల్లో భూమి కంపించింది. మొదట 5.7 తీవ్రతతో భూ ప్రకంపనలు మొదలయ్యాయని, ఒక దశలో తీవ్రత రిక్టర్‌‌ స్కేల్‌‌పై 7.6గా నమోదైందని వివరించింది. తీవ్ర స్థాయిలో భూమి కంపించడంతో ఇండ్లు, ఆఫీసుల్లోని జనాలు రోడ్లపైకి పరుగులు పెట్టారు. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో ముందుగా భూమి కంపించింది. తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో అక్కడి రవాణావ్యవస్థ స్తంభించిపోయింది. రోడ్లు, రైల్వే ట్రాక్​లకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీనికితోడు చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయిందని అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే సునామీ హెచ్చరికలను జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు ఎత్తయిన ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.

న్యూక్లియర్ ప్లాంట్లు సేఫ్

భూకంప తీవ్రతకు ఇషికావా ప్రిఫెక్చర్‌‌.. కనజావాలోని ఒనోహియోషి ఆలయం దెబ్బతిన్నది. రాతి స్తంభాలు కూలిపోయాయి. సోమవారం సాయంత్రం 4.10 గంటలకు సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా రికార్డయింది. తర్వాత వరుసగా.. 4.18 గంటలకు 6.1 తీవ్రత, 4.23 గంటలకు 4.5 తీవ్రత, 4.29 గంటలకు 4.60 తీవ్రత, 4.32 గంటలకు 4.80 తీవ్రతతో భూమి కంపించిం ది. న్యూక్లియర్ ప్లాంట్లకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. అయితే, రానున్న 2, 3 రోజుల్లో భారీ భూకంపం సంభ వించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు జపాన్ ప్రభుత్వం స్పెషల్ ఎమర్జెన్సీ సెంటర్​ను ఏర్పాటు చేసింది. దెబ్బతిన్న ఏరియాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాని పుమియో కిషిడా ఆదేశాలు జారీ చేశా రు. జపాన్‌‌లోని ఇండియన్ ఎంబసీ అధికారు లు స్పందించారు. ఆఫీస్​లో కంట్రోల్‌‌ రూం ఏర్పాటు చేశారు. సహాయం కోసం ఫోన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు.