ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: మోడీ

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: మోడీ

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నిక పోలింగ్ సందర్భంగా తొలిసారి  ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతకు ప్రధాని మోడీ  శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు  ప్రధాని మోడీ.  యువతతో  పాటు  తొలిసారి ఓటు  వేస్తున్న వారంతా  పెద్ద సంఖ్యలో పోలింగ్  కేంద్రాలకు  వెళ్లాలని కోరారు మోడీ. ఓటర్ల ఉత్సాహం స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.