మైకులు బంద్: ముగిసిన లోక్ సభ ఏడో దశ ఎన్నికల ప్రచారం

మైకులు బంద్: ముగిసిన లోక్ సభ ఏడో దశ ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికల్లో తుది విడుత సమరానికి సర్వం సిద్ధం అయ్యింది. జూన్ 1వ తేదీన జరగనున్న ఏడో దశ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఆఖరి దశలో 8 రాష్ట్రా ల్లోని 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగుంది. ఏడోదశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీహార్ లోని 8 లోక్ సభ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్ లోని 4 స్థానాలకు, ఝార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, యూపీ 13, బెంగాల్ 9 స్థానాలతో పాటు చండీగఢ్ కు తుదిదశలోనే పోలింగ్ జరగనుంది.

ఇప్పటికే ఆరుదశల్లో ముగిసిన ఎన్నికలల్లో 486 స్థానాలకు పోలింగ్ పూర్తైంది. ఇక పంజాబ్ లోని 13 లోక్ సభ స్థానాలకు హిమాచల్ ప్రదేశ్ లోని 4 లోక్ సభ స్థానాలకు ఏడోదశలో ఒకే సారి పోలింగ్ పూర్తి కానుంది. జూన్1వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడే అవకాశ ఉన్నట్టు తెలుస్తుంది. ఏడో దశలో ప్రధాని మోడీ వారణాసి నుంచి పోటీలో నిలిచారు.

ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో తొలి దశలో 66.14శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత రెండో విడతలో 66.71, మూడో విడతలో 65, నాలుగో విడతలో 69 శాతం,ఐదో విడతలో 62శాతం ఓటింగ్ నమోదు కాగా.. ఆరో విడతలో 62శాతం నమోదైంది. మొత్తం 545 స్థానాలకు ఇప్పటి వరకు 488 స్థానాలకు పోలింగ్ పూర్తైంది.. మరో 57 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు ప్రకటించనున్నారు.