- చిలుకల గుట్టకు పూజారులు
- భక్త జన గుడారంలా మేడారం
- సమ్మక్క రాక వేళ మూడంచెల భద్రత
మేడారం టీం: సమ్మక్క రాకకు సర్వం సిద్ధమైంది. పూజారులు చిలుకల గుట్టకు వెళ్లి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కకు పూజలు నిర్వహించి తీసుకు రానున్నారు. సమ్మక్క రాక వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా మూడంచెల భద్రత కల్పించినట్టు ములుగు ఎస్పీ తెలిపారు. ఈ రాత్రికి సమ్మక్క గద్దెకు చేరడంతో మహాజాతర సంపూర్ణమవుతుంది. ఇవాళ రాత్రి నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు వనదేవతలంతా గద్దెలపై ఉండి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.