4 కంకర క్వారీలకు రూ. 60 కోట్ల ఫైన్

4  కంకర క్వారీలకు రూ. 60 కోట్ల ఫైన్

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం గ్రామంలో ఉన్న కంకర క్వారీల్లో అనుమతులకు మించి తవ్వకాలు జరపడంతో మైనింగ్ శాఖ అధికారులు భారీ జరిమానా విధించారు. తోగ్గూడెంలో ఆరు అనుమతి పొందిన కంకర క్వారీలు ఉన్నాయి. నాలుగు క్వారీల యజమానులు వారు తీసుకున్న అనుమతితో సంబంధం లేకుండా ఎక్కువ విస్తీర్ణంలో కంకర వెలికి తీసినట్లు ఇటీవల సర్వే చేసిన అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మైనింగ్ శాఖ అధికారులకు నివేదిక ఇవ్వడంతో ఆ శాఖ రూ. 60 కోట్ల మేర జరిమానా విధించింది.