
జమ్మూకశ్మీర్ లో కాల్పులు జరిగాయి. రాష్ట్రంలోని బటోటీ జాతీయ రహదారిపై శనివారం ఉదయం సైనిక బలగాలకు, ఇద్దరు అనుమానితులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు కారులో వేగంగా వెళుతున్నారు. కారు ఆపాలని సైనికులు కోరినా ఆపకుండా పారిపోతున్నారు. దీంతో అలర్టైన భద్రతా బలగాలు పారిపోతున్న వ్యక్తులను పట్టుకునేందుకు కాల్పులు జరిపారు. వారు ఎదురు కాల్పులు జరిపారు. ఇరువురి మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు రక్షణశాఖ అధికార ప్రతినిధి తెలిపారు.