హైదరాబాద్ లో రూ. 15 లక్షల హర్యానా మద్యం సీజ్.. ఇద్దరు అరెస్ట్..

హైదరాబాద్ లో రూ. 15 లక్షల హర్యానా మద్యం సీజ్.. ఇద్దరు అరెస్ట్..

హైదరాబాద్ లో లిక్కర్ ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా మద్యం సేవిచేవాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్ లో. ఈ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని అంతర్రాష్ట్ర మద్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది. ఎక్సైజ్ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి కట్టడి చేస్తున్నా కూడా.. అక్రమ మద్యం దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. మరోసారి హైదరాబాద్ లో భారీగా అంతర్రాష్ట్ర మద్యం సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. హర్యానా నుంచి నగర్ కర్నూల్ కి తరలిస్తున్న రూ. 15 లక్షల మద్యాన్ని శనివారం ( జూన్ 21 ) హైదరాబాద్ లో సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 

ALSO READ | హైదరాబాద్ మాదాపూర్లో భారీ రియల్ ఎస్టేట్ స్కాం.. బై బ్యాక్ పేరుతో రూ. 500 కోట్లు మోసం..

పటాన్ చెరు మండలం ముత్తంగి దగ్గర అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. 34 కార్టన్ బాక్సుల్లో తరలిస్తున్న రూ.15 లక్షల మద్యాన్ని సీజ్ చేశారు అధికారులు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మద్యం తరలిస్తున్న XUV 500 వాహనాన్ని సీజ్ చేశారు.  

నాగర్ కర్నూల్  జిల్లాకు చెందిన  రవీందర్ అనే వ్యక్తి ఈ లిక్కర్ ను తీసుకురమ్మనట్టుగా నిందితులు ఒప్పుకున్నట్లు వెల్లడించారు అధికారులు.జానీ వాకర్, బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్,  జెమ్సన్, చివాస్, బ్రాండ్ల లిక్కర్  తెలంగాణలో సుమారు రూ.15 లక్షల విలువ చేస్తుందన్నారు అధికారులు.రవీందర్ అనే వ్యక్తి పరారీలో ఉండగా  టిక్యా నాయక్, నవీన్ కుమార్ లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.

అక్రమ మద్యాన్ని తరలిస్తున్న XUV 500 వాహనాన్ని సీజ్ చేసి నట్లు తెలిపారు అధికారులు. అంతర్రాష్ట్ర మద్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు.