హైదరాబాద్ మాదాపూర్లో భారీ రియల్ ఎస్టేట్ స్కాం.. బై బ్యాక్ పేరుతో రూ. 500 కోట్లు మోసం..

హైదరాబాద్ మాదాపూర్లో భారీ రియల్ ఎస్టేట్ స్కాం.. బై బ్యాక్ పేరుతో రూ. 500 కోట్లు మోసం..

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి తక్కువ కాలంలో రెట్టింపు సంపాదించాలనే ఆశ చాలామందికి ఉంటుంది. రియల్ ఎస్టేట్ బూమ్ పుణ్యమా అని అలా కోట్లకు కోట్లు సంపాదించినోళ్లు కూడా చాలామంది ఉన్నారు. జనాల్లో ఉన్న ఈ వీక్ నెస్ ని కాష్ చేసుకుంటున్నాయి ఫ్రాడ్ కంపెనీలు. తక్కువ కాలంలో అధిక లాభాలంటూ ఆశ చూపి జనాలు సొమ్ము దోచుకుంటున్నారు కేటుగాళ్లు. ఇప్పుడు హైదరాబాద్ లోని మాదాపూర్ లో మరో భారీ రియల్ ఎస్టేట్ స్కాం బయటపడింది. బై బ్యాక్ పాలసీ పేరుతో.. తక్కువ కాలంలో అధిక లాభాలంటూ ఆశ చూపి సుమారు రూ. 500 కోట్లు కొల్లగొట్టింది ఓ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా కంపెనీ. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

ALSO READ | ఉద్యోగులకు షాకిచ్చిన Genpact: రోజుకు 10 గంటలు వర్క్ చేయాలంటూ హుకుం..

ఏవీ ఇన్ఫ్రా కాన్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ భారీ మోసానికి పాల్పడింది.. బై బ్యాక్ స్కీం పేరుతో భారీగా వసూళ్లు రాబట్టింది కంపెనీ. తమ సంస్థలో పెట్టుబడులు పెట్టినవారికి డబుల్ అమౌంట్ ఇస్తామని, అమౌంట్ ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చింది కంపెనీ.ఇంకేముంది.. వస్తే రెట్టింపు లాభం, లేకపోతే ల్యాండ్ ఎలాగో మిగులుతుంది కదా ఆశపడ్డ జనం ఎగబడి పెట్టుబడి పెట్టారు. సుమారు 500 మంది దాకా పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు తెలుస్తోంది. ఒక వృద్ధుడు ఏకంగా రూ. 84 లక్షలు పెట్టుబడినట్లు తెలుస్తోంది.

నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా లాంటి ప్రాంతాల్లో వెంచర్లు అంటూ నమ్మించారని.. 18 నెలలకు 50 శాతం అదనంగా ఇస్తామని తమను నిలువునా ముంచేశారని వాపోతున్నారు బాధితులు. తీరా అడిగితే 18 నెలల తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఉంది అక్కడ ఇస్తాను అంటూ కంపెనీ చైర్మెన్ మాట దాటవేస్తున్నాడని... బ్లాంక్ చెక్ లు ఇస్తూ తప్పించుకు తిరుగుతున్నాడని అంటున్నారు బాధితులు. 

మోసపోయామని గ్రహించిన బాధితులు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.