
మెహిదీపట్నం, వెలుగు: చేతి వృత్తులను ప్రోత్సహించాలనే ఆలోచనతో త్వరలో సిటీలో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో గురువారం అసిఫ్నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ–శ్రమ్కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.చీఫ్ గెస్ట్గా కేంద్రమంత్రి కిషన్రెడ్డి పాల్గొని కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీ అఫైర్స్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఎన్టీఆర్ స్టేడియంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి 350 మంది చేతివృత్తుల కళాకారులు స్టాల్స్ పెట్టనున్నట్లు వెల్లడించారు. కేంద్రమంత్రి ముక్తార్అబ్బాస్నఖ్వీ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, బీజేపీ లీడర్లు రాహుల్ చంద్ర, ముఖేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.