2023లో పుంజుకున్న ప్యాసింజర్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ ఎగుమతులు

2023లో పుంజుకున్న ప్యాసింజర్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ ఎగుమతులు
  • టాప్‌‌‌‌‌‌‌‌లో మారుతి, హ్యుందాయ్‌‌‌‌‌‌‌‌, కియా మోటార్స్‌‌‌‌‌‌‌‌
  • కరోనా ముందు స్థాయికి చేరుకోవడానికి మరో రెండేళ్లు పట్టే ఛాన్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ :  కార్లతో సహా  లోకల్‌‌‌‌‌‌‌‌గా తయారైన  ప్యాసింజర్ వెహికల్స్ (టూవీలర్లు, త్రీవీలర్లు మినహాయించి) ఎగుమతులు  పుంజుకుంటున్నాయి. కిందటేడాది సుమారు  6.6 లక్షల నుంచి 6.75 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతి అయ్యాయని అంచనా. అయినప్పటికీ కరోనా ముందు స్థాయి అంటే 2017 లో నమోదైన పీక్ లెవెల్ 7.4 లక్షలకు ఇంకా కొంత దూరంలో ఉన్నాం. మారుతి సుజుకీ  కిందటేడాది 2.69 లక్షల  కార్లను ఎగుమతి చేసింది.  ఒక ఏడాదిలో కంపెనీ చేసిన గరిష్ట ఎగుమతులు ఇవే.  2022 లో  2.63 లక్షలు, 2021 లో 2.05 లక్షల బండ్లను ఎగుమతి చేసింది.  గత ఐదేళ్లు చూసుకుంటే మారుతి సుజుకీ సగటున ఏడాదికి  లక్ష నుంచి 1.25 లక్షల బండ్లను ఎగుమతి చేస్తోంది. గత కొన్నేళ్లుగా గ్రోత్ బాటలో ఉంది.  ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న కార్లలో 40 శాతం మారుతివే అని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ అఫైర్స్‌‌‌‌‌‌‌‌) రాహుల్ భార్తి అన్నారు.  వివిధ దేశాల్లో కొత్త కార్లను లాంచ్ చేస్తున్నామని, అక్కడ డిస్ట్రిబ్యూషన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌‌‌‌‌‌‌‌కు తగ్గ టెక్నాలజీతో కార్లను తీసుకొస్తున్నామని, అఫోర్డబుల్ ధరల్లో ఇవి అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.   బెస్ట్‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌ అండ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌ విధానాలను అమలు చేస్తున్నామని, అందుకే తమ ఎగుమతులు పెరుగుతున్నాయని వివరించారు. అంతేకాకుండా గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా టయోటాతో సుజుకీ టై అప్ అయ్యింది. దీంతో కంపెనీ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ మెరుగుపడింది.

గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా మంచి రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌..

హ్యుందాయ్‌‌‌‌‌‌‌‌ 1.64 లక్షల కార్లను 2023 లో ఎగుమతి చేసింది. 2022 లో ఎగుమతి చేసిన  1.48 లక్షల కార్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి సాధించింది. ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న ప్యాసింజర్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌లో హ్యుందాయ్ వాటా 25 శాతంగా ఉంది. ‘2023 లో  కొత్త అవకాశాలు క్రియేట్ అయ్యాయి. కానీ, జియో పొలిటికల్ టెన్షన్లతో రవాణాలో ఇబ్బందులు తలెత్తాయి. న్యూ వెన్యూ, ఐ10 మోడల్స్‌‌‌‌‌‌‌‌కు వివిధ దేశాల్లో డిమాండ్ పెరిగింది. కంపెనీ ఎగుమతులు పెరగడానికి ఇదొక కారణం’ అని హ్యుందాయ్‌‌‌‌‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరుణ్ గార్గ్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.  చెన్నైలో తయారు చేసిన తమ కార్లకు గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పారు. చాలా మోడల్‌‌‌‌‌‌‌‌ కార్లు సంబంధిత సెగ్మెంట్లలో లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్నాయని అన్నారు.  ఉదాహరణకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఫ్లీట్ (క్యాబ్‌‌‌‌‌‌‌‌) సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో  హ్యుందాయ్ యాక్సెంట్ (వెర్నా) కార్లకు  మంచి గిరాకీ ఉందని  వెల్లడించారు. ఈ కంపెనీ సౌత్ ఆఫ్రికా, సౌది, మెక్సికో, చిలీ, పెరూ దేశాలకు ఇండియా నుంచి కార్లను ఎగుమతి చేస్తోంది. ఇప్పటి వరకు చెన్నై ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో తయారైన  3.5 లక్షల కార్లు, ఎస్‌‌‌‌‌‌‌‌యూవీలను 80 మార్కెట్లకు ఎగుమతి చేసింది. కియా మోటార్స్‌‌‌‌‌‌‌‌, నిస్సాన్‌‌‌‌‌‌‌‌, ఫోక్స్‌‌‌‌‌‌‌‌వ్యాగన్‌‌‌‌‌‌‌‌, రెనాల్ట్‌‌‌‌‌‌‌‌ ఎగుమతులు  కూడా పెరుగుతున్నాయి. కార్ల ఎగుమతులు పుంజుకుంటున్నా, కరోనా ముందు స్థాయిలకు చేరుకోవడానికి కనీసం ఇంకో రెండేళ్లు పడుతుందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఫోర్డ్స్‌‌‌‌‌‌‌‌ ఇండియాలో తన కార్ల తయారీని ఆపేయడంతో ఎగుమతులపై కొంత ప్రభావం పడిందని చెప్పారు.