ఎడపల్లి, వెలుగు : మండలంలోని బాపునగర్ గ్రామాన్ని ఐ కేర్ ఫౌండేషన్ దత్తత తీసుకుంటున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉడుతల నరేశ్తెలిపారు. మంగళవారం ఫౌండేషన్ బృందం గ్రామ సర్పంచ్ నగునూరి అనురాధ రాజశేఖర్, ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ప్రజలందరికీ పరిశుభ్రత, పారిశుధ్యం తదితర కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మహిళా సాధికారిక కార్యక్రమాలు చేపడుతామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
