2 రోజుల FB పరిచయంలోనే ప్రీతిని చంపేశాడు : ఆమెకు ఫ్యామిలీ.. వీడు ఇంజినీరింగ్ స్టూడెంట్..

2 రోజుల FB పరిచయంలోనే ప్రీతిని చంపేశాడు : ఆమెకు ఫ్యామిలీ.. వీడు ఇంజినీరింగ్ స్టూడెంట్..

సోషల్ మీడియా ఇన్స్టంట్ పరిచయాలు ఎంత డేంజరో.. ఎలా ఉన్న జీవితాలు ఎలా మారిపోతాయో ఉదాహరణలు కోకొల్లలు. అడ్డూ అదుపు లేకుండా.. ఎల్లలు దాటి.. హద్దులు మీరుతూ అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు చాలా మంది. అందులో యూత్ ఒక్కటే కాదు.. ఫ్యామిలీస్ కూడా ఈ ఊబిలో చిక్కుకుంటున్నాయి. పిల్లలు, కుటుంబ సభ్యులు ఉన్నారన్న స్పృహ లేకుండా.. మత్తులో కొందరి జీవితాలు చిత్తై పోతున్నాయి. 

కేవలం రెండు రోజుల పరిచయంతో శారీరక సుఖం కోసం ముక్కూ మొహం తెలియని వాడి కోసం ఔటింగ్ కు వెళ్లిన ఒక మహిళ చివరికి శవమై తేలింది. చేయాల్సిన ఎంజాయ్ చేశాక.. ఆమెను చంపి పాతి పెట్టిన తీరు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. కర్ణాటకలో జరిగిన ఈ షాకింగ్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

వివరాల్లోకి వెళ్తే..  కర్ణాటకలోని మాండ్య జిల్లాలో 28 ఏళ్ల పునీత్ గౌడ అనే యువకుడు.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రీతి సుందరేశ్ అనే మహిళనుహత్య చేసి, మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టాడు. కేవలం రెండు రోజుల ఆన్ లైన్ పరిచయం తర్వాత ఇద్దరూ కలిసి ఔటింగ్ కు వెళ్లడం.. రోజంతా గడిపిన తర్వాత హత్య చేయడం సంచలనంగా మారింది. 

మంగళవారం (జూన్ 24) నిందితుడు పునీత్ గౌడను పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలిని  హసన్ జిల్లాకు ప్రీతి సుందరేష్‌గా గుర్తించారు. ఆమె వివాహిత అని.. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుడు  మాండ్య జిల్లాకు చెందిన పునీత్ గౌడ ఇంజనీరింగ్ చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఘటనకు రెండు రోజుల ముందు ఇద్దరికీ  ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది.  ఇద్దరూ ఔటింగ్ కు వెళ్లాలని.. ఫిజికల్ గా కలవాలని డిసైడయ్యారు. ప్లాన్ ప్రకారం శనివారం (జూన్ 21), ప్రీతి తన కుటుంబ సభ్యులకు తెలియకుండా పునీత్‌తో కలిసి తన కారులో బయటకు వెళ్లింది. ఇద్దరూ హసన్ సమీపంలోని ఏకాంత ప్రదేశంలో  ప్రైవేట్ గా గడిపారు. 

ఆ తర్వాత వారి మధ్య ఏదో విషయంపై తీవ్ర వాగ్వాదం జరిగిందని పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ గొడవలో, పునీత్ కోపంతో ప్రీతిపై దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు చెప్పారు. హత్య తర్వాత, నిందితుడు ప్రీతి మృతదేహాన్ని మాండ్య జిల్లాలోని కెఆర్ పేట్ తాలూకాలోని కట్టుర్‌ఘట్ట అడవి మార్గం గుండా తన కారులో తీసుకెళ్లాడు. నేరుగా తన పొలానికి తీసుకెళ్లి అక్కడే లో పాతిపెట్టాడని పోలీసులుతెలిపారు. 

పొద్దున వెళ్లిన ప్రీతి కనిపించకపోయే సరికి ఆందోళనతో ఆమె కుటుంబ సభ్యులు శనివారం హసన్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కాల్ డిటైల్ రికార్డ్స్ , ఫేస్‌బుక్ మెసేజ్ ల ఆధారంగా పునీత్ కు ఆమెకు మధ్య జరిగిన ఛాటింగ్ ను గుర్తించారు. పునీత్ తో కలిసి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత పునీత్ ను అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టారు. 

అయితే విచారణలో నిందితుడు పునీత్ చెప్పిన వివరాలతో పోలీసులు షాకయ్యారు. కేవలం రెండు రోజుల పరిచయంతోనే తాము ఇద్దరం ఔటింగ్ కు వెళ్లినట్లు చెప్పాడు. ఇద్దరం శారీరకంగా కలవాలని డిసైడ్ అయ్యామని.. ఆ రోజు గడిపినట్లు చెప్పాడు. ఈ రిలేషన్ కొనసాగించాలని ప్రీతి కోరినట్లు పోలీసులకు తెలిపాడు. అందుకోసం తనకు డబ్బు ఆఫర్ చేసిందని, కానీ తను నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పాడు. మాటకు మాట పెరిగి  చివరికి హత్య చేయాల్సి వచ్చిందని పోలీసుల ముందు అంగీకరించాడు నిందితుడు పునీత్ గౌడ

బుధవారం (జూన్ 25), మాండ్య పోలీసులు నిందితుడిని మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశానికి తీసుకెళ్లారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు చెప్పారు పోలీసులు.