నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్ట్

నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్ట్

అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  మొహాలీ, పంజాబ్‌కి చెందిన ఏడుగురు ముఠాను సైబారాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ముఠాకి చెందిన నవీన్ బొటాని కీలక సూత్రధారిగా ఉన్నాడని.. విదేశాల్లో ఉన్న వారికి క్రెడిట్ కార్డులను ముఠా సప్లై చేస్తోందన్నారు. ఆన్‌లైన్ ద్వారా క్రెడిట్ కార్డులను ముఠా అమ్ముతోందని.. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులను టార్గెట్‌గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ 50 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారన్నారు. పక్కా సమాచారంతో ఇవాళ నకిలీ కాల్ సెంటర్ ముఠాను అరెస్ట్ చేసినట్టు తెలిపారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.