ఖమ్మంలో రూ. 7 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం

ఖమ్మంలో రూ. 7 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ముఠా నుంచి రూ.7 కోట్ల విలువ చేసే నకిలీ నోట్లను  స్వాధీనం చేసుకున్నారు.

అమాయకులకు  రెట్టింపు డబ్బు ఆశ చూపి మోసం చేస్తున్నారన్నారని జిల్లా నగర కమిషన్ ఇక్బాల్ తెలిపారు. ఈ ముఠాను నమ్మి చాలా మంది మోసపోయారన్నారు. ముఠా సభ్యులు తెలంగాణ, ఏపీ, తమిళనాడులోనూ మోసాలకు పాల్పడ్డారని చెప్పారు. నిందితుల నుండి 7 కోట్ల నకిలీ నోట్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు… 5 గురిని అరెస్టు చేశారు.,మరో 8 మంది పరారీలో ఉన్నారని తెలిపారు.వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.