హైదరాబాద్, వెలుగు: మాగంటి గోపీనాథ్ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ను దెబ్బకొట్టాయి. తన కొడుకు గోపీనాథ్ మరణంపై అనుమానాలున్నాయని తల్లి పోలీసులను ఆశ్రయించింది. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ఇవ్వడంపై గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి, కుమారుడు ప్రద్యుమ్న తారక్ మీడియా ముందుకు వచ్చారు.
మొదటి భార్యను తానున్నాక సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఎలా ఇస్తారంటూ మాలినీదేవి ప్రశ్నించారు. ఈ విషయంలో తమను బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారంటూ వాళ్లు ఆరోపణలూ చేశారు. ఇటు గోపీనాథ్ తల్లి మహానంద కుమారి కూడా మీడియా ముందుకు వచ్చి.. సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మహానంద కుమారి, మాలినీ దేవి, ప్రద్యుమ్న తారక్ కలిసి శేరిలింగంపల్లి ఎమ్మార్వో ఆఫీసులో ఫిర్యాదు సైతం చేశారు.
సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి..!
అభ్యర్థిని ప్రకటించింది మొదలు బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్నే ప్రయోగించింది. గోపీనాథ్ మృతితో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన భార్య సునీతను గెలిపించుకోవాలని ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ వచ్చింది. ఆడబిడ్డ అనే సెంటిమెంట్నూ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఆడబిడ్డపై అందరూ కలిసి దాడి చేస్తున్నారంటూ కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చినా.. మరి వాళ్ల సొంత ఇంటి ఆడబిడ్డపై అడుగడుగునా చేసిన దాడుల గురించి ఎందుకు మాట్లాడడం లేదన్న చర్చ జనాల్లో ఆలోచన రేకెత్తించింది.
