కుక్క కరిచిందని ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా.. నీటి గుంతలో పడి ఫ్యామిలీ గల్లంతు

కుక్క  కరిచిందని ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా.. నీటి గుంతలో పడి ఫ్యామిలీ గల్లంతు

వరంగల్ జిల్లా పరకాల మండలం వెళ్లంపల్లి శివారులో విషాదం చోటుచేసుకుంది  ఓ బైక్ అదుపు తప్పి నీటి గుంతలో పడిపోవడంతో ముగ్గురు   కుటుంబం సభ్యులు గల్లంతయ్యారు. దీంతో చోటు అనే బాలుడు చనిపోయాడు. అతని తల్లిదండ్రుల జాడ తెలియడం లేదు. ఇద్దరి కోసం గుంతలో గాలిస్తున్నారు స్థానికులు.

కొడుకు చోటుకు వీధి కుక్క కరవడంతో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు పేరెంట్స్.  ట్రీట్మెంట్ చేయించుకొని బైక్ పై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చోటు తల్లి రాజేశ్వరి 6 నెలల గర్భిణీ.