ఆర్ధిక స‌మ‌స్య‌ల‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కుటుంబ ‌స‌భ్యులు

ఆర్ధిక స‌మ‌స్య‌ల‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కుటుంబ ‌స‌భ్యులు

విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని ఓ లాడ్జిలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిని పెందుర్తి శివారు బంధుపాలెంకు చెందిన అప్పలరాజు కుటుంబంగా గుర్తించారు. అప్పలరాజు, తన భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి ఇటీవల అశ్వినీలాడ్జ్‌లో గదిని అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది. అప్పుల భారంతోనే తన కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖలో పేర్కొన్నారు.ఈ ఘటనపై మృతుల బంధువులకు ద్వారకానగర్‌ పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.