ములుగు రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతి శివైక్యం

ములుగు రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతి శివైక్యం

తెలుగు ప్ర‌జ‌ల‌కు ఎంతో సుప‌రిచితులైన ప్ర‌ముఖ జ్యోత్యిష్య పండిత నిపుణులు, ముగులు రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతి శివైక్యం చెందారు. అనారోగ్యం కార‌ణంగా ఆదివారం మృతిచెందారు. ఊపిరి తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉంద‌ని సిద్ధాంతి అన‌డంతో కుటుంబ స‌భ్యులు వెంట‌నే పంజాగుట్టాలోని నిమ్స్ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.  అయితే ఆసుప‌త్రికి చేరుకునే లోపే రామ‌లింగేశ్వర సిద్ధాంతి మార్గ‌మ‌ద్యంలో తుది శ్వాస విడిచిన‌ట్లు డాక్ట‌ర్లు ధృవీక‌రించారని చెప్పారు కుటుంబ స‌భ్యులు.

టీవీ ప్రోగ్రామ్‌లో వార ఫ‌లాలు చెబుతూ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఎంతో మందికి చేరువ‌య్యారు. ఈయ‌న చెప్పే రాశి ఫలాల‌ను తెలుగు రాష్ట్రాల వారే కాకుండా విదేశాల్లో ఉంటే తెలుగు వారు కూడా ఎంత‌గానో విశ్వ‌సిస్తుంటారు.