ప్రముఖ కార్టూనిస్ట్ గోపి కన్నుమూత.. కేసీఆర్ సంతాపం

ప్రముఖ కార్టూనిస్ట్ గోపి కన్నుమూత.. కేసీఆర్ సంతాపం

హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు గోపి (లూసగాని గోపాల్ గౌడ్) మరణంపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేటర్ గా, కార్టూనిస్ట్ గా తన కుంచెతో అద్భుత ప్రతిభను కనబరిచిన పాలమూరుకు చెందిన గోపి మరణం తీరని లోటని కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఒక గొప్ప చిత్రకారునడ్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. గోపి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.