వైజాగ్లోని తన ఇంట్లో ఉరేసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలు
విశాఖపట్నం, వెలుగు: ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలు జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. జీవితంపై విరక్తితో బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు లెటర్రాసి తన ఇంట్లో శనివారం ఉరివేసుకున్నారు. ప్రముఖ రచయిత, సన్నిహితుడు రామతీర్థ ఆకస్మిక మరణంతో మనస్తాపానికి లోనై ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని ఎంవీపీ కాలనీ పోలీసులు చెబుతున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ(ఇంగ్లిష్)లో గోల్డ్మెడల్సాధించారు. ఎంఏ(ఫిలాసఫీ, సోషియాలజీ), ఎమ్మెస్సీ సైకాలజీతో పాటు ఎం.ఎడ్ పూర్తిచేసిన జగద్ధాత్రి లెక్చరర్గానూ పనిచేశారు. తెలుగు, ఇంగ్లిష్లలో పలు రచనలతో పాటు కవితలు కూడా రాశారు. పలు రచనలను అనువదించారు, పత్రికలకు వ్యాసాలు రాశారు. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే జగద్ధాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలియడంతో సాహితీలోకం, సోషల్మీడియాలో పలువురు సంతాపం వ్యక్తం చేశారు.