దర్బార్ హిట్ కోసం.. రజనీ అభిమానుల ప్రత్యేక పూజలు

దర్బార్ హిట్ కోసం.. రజనీ అభిమానుల ప్రత్యేక పూజలు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా దర్బార్. ఈ చిత్రం రేపు(జనవరి 9న) విడుదల కానుంది. నయన తార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం రజనీ అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మధురైలోని రజనీ అభిమానులు బుధవారం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శూలాలతో శరీరంపై గుచ్చుకొని (వేల్‌ కావడి) రజనీపై తమకున్న భక్తిని చాటుకున్నారు. 15 రోజులపాటు ఉపవాసముండి విడుదలకు ముందు రోజైన బుధవారం నాడు ‘మాన్ సోరు'(నేలపైనే భోజనం) నిర్వహించారు. ఇలా ఉపవాస దీక్ష చేసి ఆఖరి రోజున నేలపైనే భోజనం చేయడం వల్ల సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఆ అభిమానులు అంటున్నారు.

Fans of Rajinikanth offer special prayers at a temple for success of his upcoming movie 'Darbar'