చండీగఢ్: వ్యవసాయ రంగానికి సంబంధించి మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త బిల్లును నిరసిస్తూ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేపీ మిత్రపక్షమైన అకాళీదల్ పార్టీ నేత అయిన సిమ్రత్ కౌర్ మంత్రిగా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వ్యవసాయానికి సంబంధించిన మూడు కొత్త బిల్లులపై పంజాబ్, హర్యానాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ బిల్లును నిరసిస్తూ ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు పంజాబ్లో రైల్ రోకోకు ఫార్మర్ బాడీ పిలుపునిచ్చింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఈ నెల 24-26 వరకు రైల్ రోకో నిర్వహించనున్నట్లు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ సర్వాన్ సింగ్ పంధేర్ తెలిపారు. ఇప్పటికే ఈ మూడు బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్లోని కొన్ని రైతు సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. కొత్త బిల్లుల వల్ల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) విధానం నిర్వీర్యం అవుతుందని, పెద్ద కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి తలెత్తుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం సదరు బిల్లుల ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర, మార్కెట్ను పొందుతారని చెబుతోంది.
వ్యవసాయ బిల్లులకు నిరసనగా రైల్ రోకో.. ఫార్మర్స్ బాడీ పిలుపు
- దేశం
- September 18, 2020
లేటెస్ట్
- వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు
- జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం
- 1350 కోట్లు పెండింగ్.. GHMC ఆఫీసు ముందు కాంట్రాక్టర్ల ఆందోళన
- సంబరాలకు సిద్ధం అవ్వండంటూ ట్వీట్.. వైసీపీ కాన్ఫిడెన్స్ ఏంటి...
- ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసాలు..భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు అరెస్ట్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- V6 DIGITAL 18.05.2024 EVENING EDITION
- అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు
- ఎన్నికల హింస ఎఫెక్ట్: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ..
- MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా